Thursday, June 17, 2021

అధికారులు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాలి: సీఎస్

హైదరాబాద్ : 17/06/2021

Q News మీడియా సౌజన్యంతో 

అధికారులు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాలి: సీఎస్

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ మేరకు అధికారులు పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. స్థానికి సంస్థలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, గ్రామాల్లో రాత్రి బసలు చేసి పారిశుద్ధ్యం ఇతర డెవలప్మెంట్ కార్యక్రమాలను పరిశీలించాలని అన్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, గ్రామ సభల నిర్వహణ, ప్రగతి నివేదికల తయారీ, సీజనల్ కేలండర్ తదితర అంశాలపై నజర్ ఉంచాలన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లలో పెద్దయెత్తున మొక్కలుపెంపకం, జిల్లాల లో అన్ని రహదారుల వెంట మల్టీలెవెల్ ఎవెన్యూ ప్లాంటేషన్, పట్టణాలలో ఖాళీ స్థలాల్లో పెద్దయెత్తున మొక్కల పెంపకం, నూతనంగా నిర్మిస్తున్న జిల్లా సమీక`త కార్యాలయాల కంప్లెక్స్లలో పచ్చదనం, తదితర అంశాలను సీఎస్ పరిశీలించారు. మొక్కలు నాటడానికి గుంతల తవ్వకం ,మిగిలిన గ్రామాల్లో పల్లె ప్రకతి వనాల ఏర్పాటు పూర్తి చేయాలని కలెక్టర్లకు కోరారు. ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు స్థలాలు అప్పగించడం తదితర అంశాలను సీఎస్ చర్చించారు. వ్యాధుల నియంత్రణపై కూడా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జిహెచ్ ఎంసి కమీషనర్ లోకేశ్ కుమార్, సిఐజి వి.శేషాద్రి, పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, అటవీ శాఖ పిసిసిఎఫ్ శోభ, పిసిసిఎఫ్, (ఎస్ ఎఫ్) ఆర్.యం.డోబ్రియల్, సీఎం ఓఎస్డి ప్రియాంకా తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment