Monday, June 21, 2021

భృతిని 10 వేలకు పెంచండి: అర్చక సమాఖ్య(నమస్తే తెలంగాణ మీడియా)

హైదరాబాద్ : 22/06/2021

భృతిని 10 వేలకు పెంచండి: అర్చక సమాఖ్య

భృతిని 10 వేలకు పెంచండి: అర్చక సమాఖ్య

హైదరాబాద్‌, జూన్‌ 21 (నమస్తే తెలంగాణ): జీవన వ్యయం పెరిగినందున అర్చకుల గౌరవభృతిని రూ.6,000 నుంచి రూ.10 వేలకు పెంచాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. మరో 2,000 మంది అర్చక ఉద్యోగులకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా వేతనాలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు సోమవారం వరంగల్‌లో సీఎం కేసీఆర్‌కు అర్చక సమాఖ్య గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తదితరులు వినతిపత్రం అందజేశారు. గతంలో అర్చకులకు రూ. 2,500గా ఉన్న గౌరవ భృతిని రూ.6,000కు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని గుర్తుచేశారు. తెలంగాణ అర్చక వెల్ఫేర్‌ ట్రస్టు బోర్డుకు నూతన కమిటీని ఏర్పాటుచేయాలని కోరారు.

No comments:

Post a Comment