Tuesday, September 8, 2020

తెలంగాణ కొత్త ఎన్నికల కమీషనర్

హైదరాబాద్ : 08/09/2020

*తెలంగాణ ఎన్నికల కమిషనర్ గా పార్థసారథి నియామకం*

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పార్థసారథి నియమితులయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్‌ తమిళిసై ఆమోదించారు. పార్థసారథి.. వ్యవసాయ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. పదవిలో పార్థసారథి ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.
కమిషనర్‌గా ఉన్న నాగిరెడ్డి ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు స్వతంత్ర ప్రతిపత్తి గల ఈ పదవిలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న లేదా విరమణ పొందిన అధికారులను కమిషనర్‌గా నియమించాల్సి ఉంటుంది. పార్థసారథి 1993 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారు. ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శి స్థాయిలో పని చేసి రిటైరయ్యారు. అగ్రికల్చర్‌ ఎమ్మెస్సీ చేసిన పార్థసారధి.. ఆదిలాబాద్‌ డీఆర్‌డీఏ పీడీగా కెరీర్‌ను ప్రారంభించారు.
ఇదిలా ఉంటే త్వరలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించినట్లు తెలుస్తోంది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment