Friday, September 11, 2020

తెలంగాణ కొత్త రెవిన్యూ బిల్లు ఆమోదం

హైదరాబాద్ : 11/09/2020

*నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఆమోదం.....*

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బిల్లు శాసనసభలో ఆమోదం పొందింది. బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం జరిగిన చర్చలో కాంగ్రెస్‌, ఎంఐఎం,భాజపా సభ్యులు తమ సలహాలు, సూచనలు చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ దానిపై సమాధానమిచ్చారు. బిల్లులో పొందుపర్చిన అంశాలపై సీఎం సుదీర్ఘంగా వివరించారు. అనంతరం నూతన రెవెన్యూ బిల్లుకు సంబంధించి తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసుబుక్‌ల బిల్లు-2020ను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అనంతరం శాసనసభను స్పీకర్‌ సోమవారానికి వాయిదా వేశారు.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment