Monday, September 14, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 15/09/2020

*తెలంగాణ లో కొత్తగా 2,058 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 51,247 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,058 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,60,571కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 984కి చేరింది. కరోనాబారి నిన్న ఒక్క రోజే 2,180 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,29,187కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,400 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,534 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 22,20,586కి చేరింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment