Wednesday, September 16, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 17/09/2020

*తెలంగాణ లో కొత్తగా 2159 కరోనా  కేసులు*

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 53,094 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,159 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,65,003కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1005కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,108 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,33,555కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,443 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,674 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 23,29,316కి చేరింది.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment