Wednesday, September 30, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 01/10/2020

*తెలంగాణ లో కొత్తగా 2,214 కరోనా  కేసులు*
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి 8గంటల వరకు 54,443 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,214 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,93,600కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1135కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,474 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,63,407కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,058 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,702 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 30,50,444కి చేరింది.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment