Monday, September 28, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 28/09/2020

*తెలంగాణ లో కొత్తగా 1,378 కరోనా  కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 1,378 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,87,211కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 7 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1107కి చేరింది. ఆదివారం 1,932 మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా..ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,56,431కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,673 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వీరిలో 24,054 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 254 మందికి కొత్తగా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

సుజీవన్ వావిలాల🖋️
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment