Sunday, September 13, 2020

తెలంగాణ కరోనా పరీక్షలు

హైదరాబాద్ : 14/09/2020

*తెలంగాణ లో కొత్తగా 1,417 కరోనా  కేసులు*

తెలంగాణలో వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. సోమవారం 34,426 మందికి పరీక్షలు నిర్వహించగా 1,417 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 264 మందికి కొత్తగా కరోనా సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 974కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,153కి చేరింది.వ్యాధి బారిన పడినవారిలో మరో 2,479 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 1,27,007 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,532 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment