Wednesday, September 9, 2020

తెలంగాణ కోవిద్ -19 పరీక్షలు

హైదరాబాద్ : 10/09/2020

*తెలంగాణ లో కొత్తగా 2,534 కరోనా కేసులు*
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 63,017 కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,534 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,50,176కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 927కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,071 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,17,143కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 32,106 యాక్టివ్‌ కేసులు ఉండగా అందులో 25,066 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న ఒక్క రోజే 327 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కొవిడ్‌ నిర్థారణ పరీక్షల సంఖ్య 19,53,571కి చేరింది.

సుజీవన్ వావిలాల
ప్రజల పక్షం

బాపట్ల కృష్ణమోహన్
ప్రజా సంకల్పం

https://prajasankalpam1.blogspot.com/ 

No comments:

Post a Comment