*తాండూర్ నియోజక వర్గంలో 290 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలు*
*వికారాబాద్ జిల్లాకు రోడ్ల అభివృద్ధికి గాను 900 కోట్ల రూపాయల నిధులు*
*ప్రజా పాలన లో భాగంగా 30 మాసాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 18:
వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజక వర్గంలో 290 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలు, బలోపేతం చేయడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనమండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్ రెడ్డి, కాలె యాదయ్య, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీలతో కలిసి రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కందనెల్లి జెపిఆర్ గార్డెన్ లో జరిగిన సభలో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.... రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాల నిమిత్తం అత్యధిక నిధులను కేటాయించి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా తాండూరు నియోజకవర్గానికి 290 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. రోడ్ల సౌకర్యం మెరుగ్గా ఉంటే పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి చెందుతాయని అలాగే ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన అన్నారు. మంజూరు అయిన పనులు వెంటనే చేపడతామని ఆయన అన్నారు. ప్రజా పాలన లో భాగంగా 30 మాసాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా అర్హుడైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. 500 రూపాయల సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.మహిళల ఆర్థిక అభివృద్ధికి మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లోనే 900 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని ఆ నీ సందర్భంగా తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను పటిష్ట పరిచే దిశగా యంగ్ ఇండియా పాఠశాలలను స్థాపించడం జరుగుతుందని మంత్రి అన్నారు. కోర్టు కేసు పరిష్కారం అయిన వెంటనే 94 కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్ వే బ్రిడ్జి పనులను 18 వారాల్లో చేపడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ.... ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూనే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. 261 కోట్ల వ్యయంతో ప్రధాన రహదారులను నిర్మించేందుకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. రవాణా వ్యవస్థ మెరుగుపరిస్తేనే అభివృద్ధి సాధ్యమని మంత్రి అన్నారు.కాగ్న నదిలో మురుగునీరు కలవకుండా 30 కోట్లను మంజూరు చేసి పనులు మొదలు పెట్టడం జరిగిందని మంత్రి అన్నారు.రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయలను మాఫీని ప్రభుత్వం చేపట్టిందన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 తదితర పరీక్షలు నిర్వహించి 70 వేల మందికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించదని మందు తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తూనే ఉదయం అల్పాహారం సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని ఆయన అన్నారు.తాండూర్ మున్సిపల్ పరిధిలో 571 మంది అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు మంత్రి తెలిపారు.అంతర్గత మురుగు కాలువల సమస్యలపై ప్రణాళికలు సిద్ధం చేస్తే అనుమతులు ఇస్తామని మంత్రి అన్నారు.శాసన మండలి చీఫ్ విప్ పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం పేదల అభ్యున్నతి కృషి చేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేయబడుతుందన్నారు. వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల రోడ్ల అభివృద్ధికి అధిక నిధులు ఇచ్చారని, రోడ్ల అభివృద్ధితో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఆయన అన్నారు. కర్ణాటక సరిహద్దు రోడ్లకు నిధులను కేటాయించి అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.స్థానిక శాసనసభ్యులు బుయ్యాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.... తాండూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అధిక నిధులను తీసుకురావడం జరుగుతుందన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం 75 కోట్ల వ్యయంతో ఏటీసీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని గత సంవత్సరం 165 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. బషీరాబాద్ రోడ్ల అభివృద్ధియే కాకుండా 30 పడకల ఆసుపత్రి, జూనియర్ కళాశాలలను మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఉమాశంకర్ ప్రసాద్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఇ.వెంకటాచారి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, ఆర్డిఓ అనిత, ఆర్ అండ్ బి ఎస్.ఇ వసంత నాయక్, ఆర్య వైశ్య కార్పొరేషన్ సంస్థ చైర్ పర్సన్ కల్వ సుజాత, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కందనెల్లి సర్పంచ్ యాదమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment