Wednesday, July 15, 2026

SIR ఓటర్ ఎన్యూమరేషన్ ఫారం ప్రక్రియ పూర్తి చేసి BLO కు అందచేసిన మీడియా టుడే జర్నలిస్ట్ బాపట్ల కృష్ణమోహన్_

*SIR ఓటర్ ఎన్యూమరేషన్ ఫారం ప్రక్రియ పూర్తి చేసి BLO కు అందచేసిన మీడియా టుడే జర్నలిస్ట్ బాపట్ల కృష్ణమోహన్*

*అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడడమే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR–2026) కార్యక్రమం ప్రధాన ఉద్దేశం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, జులై 13:

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ గాంధీ నగర్ కమ్యూనిటీ హలో లో తన ఓటర్ SIR ఎన్యూమరేషన్ ఫారం ప్రక్రియ పూర్తి చేసి BLO బందెల ప్రేమలత కు అందచేసిన సామజిక కార్యకర్త, ప్రజాసంకల్పం ఫౌండర్, మానవహక్కుల బాద్యులు, అల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సోషల్ మీడియా కన్వినర్ (ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ), మీడియా టుడే జర్నలిస్ట్ బాపట్ల కృష్ణమోహన్. ఈ సందర్బంగా  కృష్ణమోహన్ మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు (BLOలు)M. శ్రీనివాస్ రెడ్డి, BLO సూపర్‌వైజర్ రవికుమార్ తో మాట్లాడి కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, ఆన్‌లైన్ డిజిటైజేషన్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తి పారదర్శకతతో, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు.ప్రతి అర్హ ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఫారాలను పూర్తిగా నింపించి నిర్దేశిత గడువులోగా తిరిగి స్వీకరించేలా విస్తృత ప్రజా అవగాహన కల్పించాలని సూచించారు.బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవసరమైన సహాయం అందించడంతో పాటు, అందిన ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులో డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR–2026) కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి వివరాలతో నింపి నిర్దేశిత గడువులోగా సంబంధిత బూత్ స్థాయి అధికారులకు (BLOలు) తప్పనిసరిగా సమర్పించాలని తెలిపారు.అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడడమే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR–2026) కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి వివరాలతో సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment