*అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ 50వ వార్షికోత్సవ వేడుకలకు టీపీసీసీ అధ్యక్షులు కు ఆహ్వానం*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే,జులై 10:
హైదరాబాద్లోని అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ దేవాలయం (శ్రీ శ్రీ రాధా మదన్మోహన్ మందిర్)50వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరుకావాలని టీపీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు వారి సతీమణినికి ఆలయ నిర్వాహకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా వేడుకల ఆహ్వాన పత్రికను అందజేసి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరారు.ఈ ఆహ్వాన కార్యక్రమంలో రమ్యరావు పాల్గొన్నారు.ఒక ప్రముఖమైన, ప్రశాంతమైన ఆధ్యాత్మిక కేంద్రం ఈ టెంపుల్. ఇది నాంపల్లి స్టేషన్ రోడ్డులో, జి. పుల్లారెడ్డి స్వీట్స్కు సరిగ్గా ఎదురుగా ఉంది.1976లో స్థాపించబడి, శ్రీల ప్రభుపాదచే ప్రారంభించబడిన ఈ దేవాలయం శ్రీకృష్ణునికి అంకితం చేయబడింది. ఇది నిత్య భక్తి, భగవద్గీత బోధనలు మరియు ధ్యానానికి ఒక ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.
No comments:
Post a Comment