Sunday, November 6, 2022

TRS పార్టీ పేరు మార్పుపై తెరాస బహిరంగ ప్రకటన

*TRS పార్టీ పేరు మార్పుపై తెరాస బహిరంగ ప్రకటన*

హైదరాబాద్‌: తెరాస పేరు మార్పుపై ఆ పార్టీ బహిరంగ ప్రకటన జారీ చేసింది. పార్టీ పేరును 'భారత్‌ రాష్ట్ర సమితి'గా మారుస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ పేరిట జారీ అయిన ఈ ప్రకటనలో పార్టీ కొత్త పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే పంపాలని అందులో సూచించారు. అభ్యంతరాలను 30 రోజుల్లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని పేర్కొన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధలన ప్రకారం.. ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి పేరు మార్పు, ఇతరత్రా సవరణలు ఉంటే వాటిపై అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. దీనికోసం స్థానిక పత్రికలతో పాటు ఆంగ్ల పత్రికల్లోనూ సదరు పార్టీ ప్రకటనలు ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈసీ ప్రకటన జారీ చేసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment