Tuesday, November 22, 2022

అయ్యప్ప భక్తులకు.... శుభవార్త.....!

*అయ్యప్ప భక్తులకు.... శుభవార్త.....!*

ఢిల్లీ : అయ్యప్ప స్వామి భక్తులకు బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌-బీసీఏఎస్‌ శుభవార్త చెప్పింది. విమాన ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు వెసులుబాటు కల్పించింది.విమాన ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులు ఇకపై ఇరుముడిని క్యాబిన్‌ లగేజీలో తీసుకువెళ్లేందుకు అనుమతించింది. అన్ని తనిఖీల తర్వాత... అయ్యప్ప భక్తులు తీసుకెళ్లే ఇరుముడిని క్యాబిన్‌లోకి అనుమతించాలని అన్ని విమానాశ్రయాల సెక్యురిటీ సిబ్బందికి బీసీఏఎస్‌ మార్గదర్శకాలు ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 20 వరకూ విమానాల్లో శబరిమల వెళ్లే భక్తులకు వెసులుబాటు కల్పిస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది. మండలం, మకరజ్యోతి దీక్షలు పూర్తయ్యే వరకూ అవకాశం కల్పిస్తూ... బీసీఏఎస్‌ డైరక్టర్‌ జనరల్‌ ఉత్తర్వులు ఇచ్చారు

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment