Wednesday, November 23, 2022

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో భారీగా పట్టు బడ్డ గంజాయి

*షాద్ నగర్ పట్టణంలో భారీగా పట్టు బడ్డ గంజాయి*

*రాయికల్ టోల్ ప్లాజా వద్ద శంషాబాద్ ఎస్. ఓ. టి. పోలీసులు మరియు షాద్ నగర్ పోలీసులు కలిసి పట్టు కున్న గంజాయి*

*దాదాపుగా ఏడూ లక్షల విలువ చేసే గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఎల్లంపల్లి కుర్వ రమేష్ ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించిన పోలీసులు*

*గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను వలపన్ని పట్టు కున్న పోలీసు సిబ్బందిని అభినందించిన షాద్ నగర్ ఏసిపి*

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు మరియు షాద్ నగర్ పోలీసులు కలిసికట్టుగా  గంజాయ్ స్మగ్లింగ్ చేస్తున్న ఎల్లంపల్లి కి చెందిన కుర్వ రమేష్  తన కారులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు వచ్చిన సమాచారం తో అతని పై కొన్ని రోజుల నుండి నిగా పెట్టి  నిన్న రాయికల్ టోల్  ప్లాజా భద్రాచలం అటవీ ప్రాంతం నుండి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న గంజాయి నీ సీజ్ చేశారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు, విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ sot పోలీసులతో పాటు షాద్ నగర్ పోలీసులు రాయికల్ టోల్ ప్లాజా దగ్గర వాహనాన్ని  అపి తనిఖీ చెయ్యగా 110 కిలోల గంజాయి పట్టుబడింది షాద్ నగర్ ప్రాంతానికి చెందిన రమేష్ అని వ్యక్తి ఈ గంజాయి నీ భద్రాచలం నుండి టోల్  ప్లాజా లు లేని రహదారుల ద్వారా హైదరాబాద్ కు ఈ గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు, గంజాయి తరలించే క్రమంలో పట్టుబడకుండా ఉండడానికి నిందితుడు  వాహనం లో ప్రతేక ఏర్పాట్లు చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు, పట్టుబడిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్ లో 7 లక్షల వరకు ఉంటుందని తెలిపారు షాద్ నగర్ ఎసిపి కుషాల్కార్ తెలిపారు.

--------------------------------------------------------------

ఇక వివరాల్లోకి వెళ్తే షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ పరిధిలో రంగ సముద్రానికి చెందిన  కురువ రమేష్ వయసు 30 సంవత్సరాలు మరియు వరంగల్ జిల్లా  నర్సంపేట మండలం గూడూరు గ్రామానికి చెందిన వీరన్న మరియు భద్రాచలం జిల్లాకు చెందిన సోము రాజు ముగ్గురు కలిసి గంజాయిని భద్రాచలం నుండి హైదరాబాద్ కి రవాణా చేస్తూ పట్టుబడ్డారు
నిందితుడు కురవ రమేష్ వరంగల్ కు చెందిన వీరన్న భద్రాచలం వెళ్లి అక్కడ సోమరాజు అనే వ్యక్తిని కలిసి అతని ద్వారా 110 కిలోల గంజాయిని  చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసుకొని కురువ రమేష్ కు చెందిన TATA TS10 EM10 7999 గల వాహనం వెనుక భాగంలో ఒకదాని మీద ఒకటి పేర్చుకొని ఎవరికి అనుమానం రాకుండా భద్రాచలం నుండి హైదరాబాద్ కు వెళ్తూ ఎక్కడైనా పోలీసు లు పట్టుకుంటారేమోనని తెలివిగా గుంటూరు- కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్లే క్రమంలో  షాద్ నగర్ టోల్ గేట్ దగ్గర నిన్న రాత్రి 7 గంటల సమయంలో పక్క సమాచారంతో శంషాబాద్ డిసిపి మరియు షాద్నగర్ ఏసిపి గారి పర్యవేక్షణలో రాజేశ్వర్ రెడ్డి STO శంషాబాద్,మరియు షాద్నగర్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్,ఎస్సై విజయ్ మరియు కానిస్టేబుల్. షాద్నగర్ టోల్ గేట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తూ నిందితుడిని పట్టుకోవడం జరిగిందని ఏ సి పి కుశాల్కర్ మీడియాకు తెలపడం జరిగింది.ఇట్టి చేదనలో చాకచక్యంగా వ్యవహరించిన షాద్నగర్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్,ఎస్సై విజయ్ కుమార్ మరియు  ఎస్ ఓ టి రాజేశ్వర్ రెడ్డిని అభినందించి వీరికి తగిన రివార్డులను పై అధికారుల ద్వారా ఇప్పించడం జరుగుతుందని అన్నారు

       *మహేష్ బైరమోని*

No comments:

Post a Comment