Wednesday, November 9, 2022

భారత దేశంలో మానవ హక్కుల పరిస్థితి పై ఐక్య రాజ్య సమితి లో భారత దేశ ప్రతినిదుల వివరణ విందాం


*భారత  దేశంలో మానవ హక్కుల పరిస్థితి పై ఐక్య రాజ్య సమితి లో  భారత దేశ ప్రతినిదుల వివరణ విందాం* 

ఐక్య రాజ్య సమితి లో ఒక శాఖ గా పని చేసే,మానవ హక్కుల కౌన్సిల్ (U.N.O-HUMAN RIGHTS COUNCIL) ప్రతి నాలుగున్నర సంవత్సరాల కొక సారి ,సమితి సభ్య దేశాలుగా ఉన్న ఆయా 193 దేశాల నుండి వాళ్ళ దేశాల్లో  హక్కుల  పరిస్థితి పై నివేదిక తెప్పించుకొని ఆయా  దేశాలకు నివేదికను పంపించి వివరణ ను కోరుతుంది.

ఈ నివేదిక లోని హక్కుల ఉల్లంఘన అంశాలను వివిధ హక్కుల సంఘాలు, స్వచ్ఛంద  సంస్థలు ,సామాజిక ఆలోచనా పరుల నుండి ఐక్య రాజ్య సమితి సేకరించి నివేదిక తయారు చేస్తుంది.

ఈ ప్రక్రియను యూనివర్సల్ పీరియాడిక్  రివ్యూ అని (Universal Periodic Review) పిలుస్తారు. 
 ప్రతి నాలుగు న్నర  సంవత్సరాలకు జరిగే ఈ ప్రక్రియను సైకిల్ (విడత ) పిలు స్టారు. 
2022 వ సంవత్సరం లో జరిగే ఈ ప్రక్రియ నాలుగవది . 

ఐక్య రాజ్య సమితి మన దేశంలో హక్కుల పరిస్థితిపై తయారు చేసిన నివేదిక పై భారత ప్రతినిధుల బృందం వివరణ ఇస్తూ జవాబు 
చెప్పుతారు. 
ఈ కార్యక్రమం రేపటి రోజున (10-11-222-గురువారం )భారత కాలమానం ప్రకారం రాతి 7 గంటల నుంచి 10.30 వరకు ఉంటుంది . 

ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ /స్మార్ట్ ఫోన్/లాప్ టాప్ /డెస్క్ టాప్ కంప్యూటర్లలో చూడవచ్చు.

ఈ కింద ఇవ్వ బడిన లింక్ పై క్లిక్ చేసి మీరు వీక్షించవచ్చు. 
//htpps://media.un.org/en/webtv//

హక్కుల సంఘాల సభ్యులు,వివిధ సంస్థల భాద్యులు,రాజకీయ పార్టీల కార్య కర్తలు,ప్రజాస్వామిక ఆలోచనా  పరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని 
కోరుతున్నాం.  
తెలంగాణ రాష్ట్రం లో
*మానవ హక్కులఅంశాల 
ఉల్లంఘనల పై నివేదిక  తయారు చేసిన గ్రూప్*
తరపున
ఎస్.జీవన్ కుమార్
---------
వివరాలకు :
రోహిత్ --99858 03222
సంజీవ్--99855 88384

No comments:

Post a Comment