Friday, November 18, 2022

బీజేపీ టీఆర్ఎస్ పై విమర్శలు....!

*బీజేపీ టీఆర్ఎస్ పై విమర్శలు....!*

హైదరాబాద్‌: బీజేపీ (BJP), టీఆర్ఎస్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ-టీఆర్ఎస్‌ కలిసి తెలంగాణను కలుషితం చేస్తున్నాయని దుయ్యబట్టారు.అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను నమ్ముకుని సీఎం కేసీఆర్‌  రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌వి దిగజారుడు రాజకీయాలని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు తనకు ఆఫర్‌ చేశారని ఎమ్మెల్సీ కవిత  ఒప్పుకున్నారని, దీనిపై కూడా హైదరాబాద్ సీపీ ఆనంద్‌ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కవిత స్టేట్‌మెంట్‌ను సీపీ ఆనంద్‌ రికార్డ్‌ చేయాలని, ఆమెకు ఎవరు ఆఫర్‌ ఇచ్చారో వారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment