Monday, November 21, 2022

ఆదాయానికి మించి ఆస్తుల బాగోతంపైనే దృష్టంతా

*_మంత్రి మల్లారెడ్డికి ఐటీ షాక్.!_*
_● మొత్తం 50కి పైగా ప్రాంతాల్లో_
_● కొడుకు, అల్లుడు ఇళ్ళల్లోనూ_
_● బంధువులపై కూడా_
_● విద్యాసంస్థలను వదలని వైనం_
_● ఆదాయానికి మించి ఆస్తుల బాగోతంపైనే దృష్టంతా.._

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 944 000 000 9 'తెలంగాణ వాచ్"' ప్రత్యేకం)_*

*_తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నివాసాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొంపల్లిలోని మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి , అల్లుడు నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 50 బృందాలు ఏకకాలంలో ఆయన కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, నివాసాలపై, కోంపల్లిలోని పాం మెడోస్ విల్లాలోనూ ఈ ఐటి దాడులు నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు._*

*_సమీప బంధువుల ఇళ్ళల్లో.._*
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మల్లారెడ్డికి సంబంధించిన బంధువుల ఇళ్లల్లో కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో మొత్తం యాభై చోట్ల ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తుంది. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీలో సోదాలు కొనసాగుతున్నాయి.

*_పట్టించిన ఐటి రిటర్నస్:_*
ఇంకా మల్లారెడ్డి కూతురు, కొడుకు అల్లుడు నివాసాలతోపాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాల్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరాతీస్తున్నారు. ఐటీ రిటర్న్స్ చెల్లింపులకి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తున్నారు.

*_ప్రచారంలో చురుగ్గా.._*
గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, నేతల ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మల్లారెడ్డి బాగా ప్రచారం చేశారు.

*_మందు పార్టీ.. మస్త్ హవా.._*
టీఆర్ఎస్ గెలుపు కోసం ఎక్కువగా శ్రమించిన నేతల్లో మల్లారెడ్డి కూడా ఒకరిని చెప్పాలి. అక్కడి స్థానికులకు మందు పార్టీలు ఇచ్చారని, ఆయనే స్వయంగా మందు పోస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

No comments:

Post a Comment