Saturday, November 5, 2022

వందేమాతరం ,, జనగణమన కు సమాన హోదా.... స్పష్టం చేసిన కేంద్రం

*వందేమాతరం ,, జనగణమన కు సమాన హోదా.... స్పష్టం చేసిన కేంద్రం*

దిల్లీ: జాతీయ గీతం 'జనగణమన'కు, 'వందేమాతరం' గేయానికి సమాన హోదా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దిల్లీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.జాతీయ గీతం 'జనగణమన'కి సమానమైన హోదాను 'వందేమాతరం' గేయానికి కూడా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రం తాజాగా స్పందించింది. దేశంలోని ప్రతి పౌరుడు ఈ రెండింటికి సమాన గౌరవం ఇవ్వాలని స్పష్టం చేసింది.

జనగణమనకి, వందేమాతరానికి సమాన గౌరవం, హోదా కల్పించేలా మార్గదర్శకాలను రూపొందించేలా.. తగిన ఆదేశాలు ఇవ్వాలని దిల్లీ హైకోర్టులో కొద్దిరోజుల క్రితం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భారత స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం కీలక పాత్ర పోషించిందని పిటిషనర్, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో వందేమాతరానికి కూడా జనగణమనతో సమానమైన గౌరవం ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. అన్ని పాఠశాలలు, విద్యాసంస్థల్లో ప్రతిరోజూ వందేమాతరం, జనగణమన పాడేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని అశ్విని ఉపాధ్యాయ విజ్ఞప్తి చేశారు. కాగా విచారణలో భాగంగా.. ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని కేంద్ర హోం, విద్యా, సాంస్కృతిక, న్యాయ మంత్రిత్వ శాఖలకు దిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై కేంద్రం తాజాగా స్పందిస్తూ.. ఆ రెండింటికి సమాన హోదా ఉంటుందని వెల్లడించింది

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment