Wednesday, June 15, 2022

బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళన పై KTR...... ట్వీట్

*బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళన పై KTR...... ట్వీట్*

హైదరాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్జీయూకేటీ-బాసరలో 8వేల మంది విద్యార్థులు రోడ్డుపై కూర్చున్నారని.. ఈ విషయంలో స్పందించాలంటూ బత్తిని తేజగౌడ్‌ అనే యువకుడు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.వెంటనే స్పందించిన మంత్రి.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. విద్యలో నాణ్యత పెంపొందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని.. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

మరోవైపు ఈ అంశంపై కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు మంత్రి సబిత స్పందించారు. బాసర ఆర్జీయూకేటీ సమస్యలపై ఇవాళ వీసీతో సమావేశమవుతున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment