Sunday, June 19, 2022

తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా..... జస్టిస్ ఉజ్జల్ భూయాన్.....!

*తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా..... జస్టిస్ ఉజ్జల్ భూయాన్.....!*

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను బదిలీ చేసి ఆయన స్థానంలో జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌కు పదోన్నతి ఇవ్వాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఆమేరకు ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మను దిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

link Media ప్రజల పక్షం 🖋️ 

No comments:

Post a Comment