Wednesday, June 29, 2022

ప్రముఖుల రాక....సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్

*ప్రముఖుల రాక....సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్*

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ రాక సందర్భంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆంక్షలు, నిషేదాజ్ఞలు విధించారు. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ చుట్టు పక్కల 5కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారాగైడర్లు, మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల వంటివి ఎగరడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు.భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని సహా కేంద్రమంత్రులు, జాతీయ నేతలు రానున్న దృష్ట్యా ఈ ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఈనెల 30వ తేదీ ఉదయం 6గంటల నుంచి జులై 4వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఈ నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని సీపీ వివరించారు. మరో వైపు జులై 1 నుంచి 4వరకు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదని సీపీ ఆదేశాలు జారీ చేశారు.

link Media ప్రజల పక్షం🖋️

No comments:

Post a Comment