Wednesday, June 22, 2022

ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది.... తెలంగాణ లో ఏమి జరుగుతుంది.

ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది.... తెలంగాణ లో ఏమి జరుగుతుంది. ధరణి సమస్యల మీద రైతులకు అండగా ప్రజా సంకల్పం గ్రూప్ మీడియా తెలంగాణ వచ్చినప్పటినుంచి రైతుల పక్షాన పోరాడుతూనే ఉంది. అయినా ధరణి పోర్టల్ లో సమస్యలు పరిష్కారం కావడం లేదు. రైతులు కలెక్టర్ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అయినా సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఎంతో ఉన్నత చదువులు చదువుకున్న ప్రభుత్వ అధికారులు కూడా బానిసలుగా బతుకుతూ  ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజలకు జవాబుదారీ తనంగా కాకుండా  అవినీతి మార్గంలో నడుచుకుంటున్నారు. దీనికితోడు తెలంగాణలో భారతీయ జనతాపార్టీ కూడా ఈ అవినీతిని చూసి కళ్ళు మూసుకుని ఉంది. తెలంగాణ బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు టీవీల ముందు కెసిఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతామని ప్రజలను మభ్య పెట్టడమే తప్ప చేసేది ఏమీ లేదు అని ప్రజలు తెలుసుకున్నారు. అందుకే ప్రజలారా  రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో వీరందరికీ తగిన గుణపాఠం చెప్పాలి.....Bplkm🪶   prajasankalpam1.blogspot.com

No comments:

Post a Comment