Saturday, June 18, 2022

సికింద్రాబాద్ అల్లర్లు....తప్పిన భారీ ప్రమాదం....ధ. మ. రైల్వే డీ ఎం గుప్తా

*సికింద్రాబాద్ అల్లర్లు....తప్పిన భారీ ప్రమాదం....ధ. మ. రైల్వే డీ ఎం గుప్తా*

హైదరాబాద్‌: అగ్నిపథ్‌ విధానం అమలును వ్యతిరేకిస్తూ శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లలో ప్రత్యక్ష్యంగా రూ.12 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు సికింద్రాబాద్‌ రైల్వే ప్రాంతీయ మేనేజర్‌ గుప్తా వెల్లడించారు.
అంతే కాకుండా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో రైలు సర్వీసులు రద్దు చేసిన కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్‌లో గుప్తా మీడియాతో మాట్లాడారు.

అల్లర్లలో రైళ్లలో తరలిస్తున్న ప్రయాణికుల సామగ్రి పూర్తిగా ధ్వంసం అయిందని పేర్కొన్నారు. అల్లర్ల ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని వెల్లడించారు. ఈ విధ్వంసంలో 5 రైలు ఇంజిన్లు (లోకో మోటార్స్), 30 రైలు బోగీలు, పార్శి్ల్‌ కార్యాలయం పూర్తిగా ధ్వంసం అయినట్లు వెల్లడించారు. పవర్ కార్ (డీజిల్ ట్యాంకర్)కు భారీ ప్రమాదం తప్పిందని.. పవర్ కార్‌కు మంటలు అంటుకుంటే భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగేదన్నారు. ఆందోళనకారులను అదుపుచేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందన్నారు. ప్రస్తుతం అన్ని గూడ్స్ రైళ్లను పునరుద్ధరించినట్లు చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని గుప్తా వెల్లడించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment