Sunday, June 5, 2022

నేటి నుంచి టెట్ హాల్ టికెట్ల జారీ....12న యధావిధిగా పరీక్ష! పీజీ ఎంట్రన్స్‌ షెడ్యూల్‌ విడుదల నేడే....!

*నేటి నుంచి టెట్ హాల్ టికెట్ల జారీ....12 యధావిధిగా పరీక్ష!*

*పీజీ ఎంట్రన్స్‌ షెడ్యూల్‌ విడుదల నేడే....!*

*హైదరాబాద్‌*

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను ముందుగా నిర్ణయించినట్టుగానే ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్నారు.టెట్‌ పేపర్‌-1 కోసం 3,51,468 మంది, పేపర్‌-2 కోసం 2,77,884 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి హాల్‌ టికెట్లను జారీ చేయనున్నట్లు టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి ప్రకటించారు. పేపర్‌-1 పరీక్ష ఉదయం, పేపర్‌-2 పరీక్ష మధ్యాహ్నం జరగనున్నాయి. కాగా...

పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఆదివారం టెట్‌ మోడల్‌ పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ నారాయణగూడలోని పీఆర్‌టీయూ కార్యాలయంలో ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి తదితరులు ప్రశ్నపత్రాన్ని విడుదల చేశారు. అలాగే... యూటీఎఫ్‌ ఆధ్వర్యంలోనూ ఆదివారం టెట్‌ మోడల్‌ పరీక్ష జరిగింది.

రంగారెడ్డి జిల్లాలోని మూడు సెంటర్లలో పరీక్షను నిర్వహించినట్టు యూటీఎఫ్‌ అధ్యక్షుడు జంగయ్య తెలిపారు. కాగా... కామన్‌ పీజీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీపీజీఈటీ) షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేయనున్నారు. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూ తదితర సంస్థల్లో పీజీ సీట్ల భర్తీ కోసం ఈ ఏడాది నుంచి కామన్‌ ఎంట్రన్స్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

link Media ప్రజల పక్షం🖋️

No comments:

Post a Comment