Wednesday, June 8, 2022

కోవిడ్ టెస్టులు పెంచాలి.... తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశం.....

*కోవిడ్ టెస్టులు పెంచాలి.... తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశం.....*

హైదరాబాద్: కరోనా ఫోర్త్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో కొవిడ్ టెస్టులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బుధవారం కోవిడ్ 19పై హైకోర్టులో విచారణ జరిగింది.కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా చూడాలని ధర్మాసనం సూచించింది. కోవిడ్‌పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కోవిడ్ బారిన పడి చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియాపై నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ... తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment