Monday, June 27, 2022

ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది.... Bplkm🪶

                 ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది

 తెలంగాణ సాధించుకోవడం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. అలా అమరులైన అమరవీరుల ఆశయాలను నీరుగారుస్తున్న తెలంగాణ ప్రభుత్వం.

 నీళ్లు నిధులు నియామకాల ను ఈ తెలంగాణ ప్రభుత్వం పాతాళంలో నెట్టివేసింది. భారత రాజ్యాంగం కల్పించిన హక్కు లకు అనుగుణంగా ప్రజల పక్షాన ప్రజా ప్రయోజనాల కోసం నిస్వార్ధంగా  ప్రశ్నించే వారి మీద అక్రమ కేసులు పెడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం.

 తెలంగాణ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు తెలంగాణలో అన్ని ప్రభుత్వ శాఖల  అవినీతి అధికారులు అవినీతికి పాల్పడుతున్న, అవినీతి అధికారుల గురించి వార్తా కథనాలు వచ్చినా సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి తెలియచేసిన  ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. అవినీతి అధికారులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం అని ప్రజలు తెలుసుకుంటున్నారు.

 అందుకే ప్రజలారా అన్యాయాలను అక్రమాలను మీ గొంతుక ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలంగాణలోని ప్రజలందరికీ చేరే విధంగా నడుం బిగించండి. ప్రజలందరినీ జాగృతం చేయాలి. లేకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది.

 మీ ఈ పోరాటం రాజకీయాలకు అతీతంగా ఉండాలె

Bplkm🪶

No comments:

Post a Comment