Tuesday, June 14, 2022

తెలంగాణ....గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షా తేది ఖరారు....!

*తెలంగాణ....గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షా తేది ఖరారు....!*

హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తేదీని ఖరారు చేసింది తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తేదీని ప్రకటించింది.అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ ఉంటుందని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.

తెలంగాణ ఆవిర్బావం తర్వాత తొలిసారి వివిధ శాఖల్లో 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంతో పోలిస్తే గ్రూప్ వన్‌ కోసం ఈసారి భారీగా దరఖాస్తులు అందాయి. రోజుకు సుమారు పది వేల చొప్పున దరఖాస్తులు అందగా.. గడువు పెంచిన తర్వాత చివరి నాలుగు రోజుల్లో సుమారు 30 వేల మంది దరఖాస్తులు సమర్పించారు. మొత్తం 503 పోస్టులకు గానూ.. 3 లక్షల 80 వేల 202 మంది పోటీపడుతున్నారు.

అయితే దరఖాస్తుల తేదీని పొడగించాలన్న విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకోని టీఎస్‌పీఎస్సీ.. పరీక్ష తేదీ విషయంలో మాత్రం అభ్యర్థుల విజ్ఞప్తులను మాత్రం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే జులై-ఆగష్టులో నిర్వహించాలనుకున్న ప్రిలిమినరీ పరీక్షను.. అక్టోబర్‌కు జరిపింది.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment