Wednesday, June 1, 2022

మూడు రోజుల పాటు హైదరాబాద్ లో మోడీ.. అమిత్ షా!!

*మూడు రోజుల పాటు హైదరాబాద్ లో..... ఉండనున్న  మోడీ....అమిత్ షా*

న్యూఢిల్లీ, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. జులై 3 వ వారంలో 15వ తేదీ తర్వాత ఈ సమావేశాలు ఉండవచ్చని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది.మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా కూడా పాల్గొంటారు. మూడు రోజుల పాటు మోదీ, షా హైదరాబాద్‌లోనే మకాం వేస్తారని తెలిసింది. 300 నుంచి 500 మంది వరకూ బీజేపీ సీనియర్ నేతలు ఈ సమావేశాలకు హాజరౌతారని భావిస్తున్నారు. హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌లో ఈ సమావేశాలు జరగవచ్చని భావిస్తున్నారు. తాజ్‌కృష్ణాను కూడా బీజేపీ నాయకులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బీజేపీ నేతలు తరుణ్‌చుగ్, బీఎల్ సంతోష్ సమావేశాల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారని తెలిసింది.

link Media ప్రజల పక్షం🖋️

No comments:

Post a Comment