Thursday, June 16, 2022

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన పై స్పందించిన రాహుల్ గాంధీ!

*బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన పై స్పందించిన రాహుల్ గాంధీ!*

హైదరాబాద్‌: నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఆందోళనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. విద్యార్థుల వాస్తవ డిమాండ్లను సిల్లీగా పేర్కొనడంపై విమర్శించారు.క్యాంపస్‌లో దయనీయమైన పరిస్థితులను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు అందించిన ఎనలేని కృషిని సీఎం కేసీఆర్‌ మరిచిపోయారా? అని ప్రశ్నించారు. అహంకారపూరిత కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల శక్తిని తక్కుగా అంచనా వేయకూడదన్నారు. తెలంగాణ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్‌ పేర్కొన్నారు.

link Media ప్రజల పక్షం 🖋️ 

No comments:

Post a Comment