Wednesday, June 1, 2022

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై!

*తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై!*

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.ఆరు దశాబ్దాలకు పైగా సాగిన అవిశ్రాంత పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం యువత చేసిన త్యాగాలతో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఉత్సాహంతో, గర్వంతో చేసుకునే వేడుక అన్నారు. రాష్ట్ర అస్థిత్వ పరిరక్షణ, వనరులు, అవకాశాల్లో న్యాయమైన వాటాను విధాన నిర్ణేతలు, నాయకులు, కష్టపడి పనిచేసే ప్రజలు గుర్తించారని అనుకుంటున్నట్టు తెలిపారు.

రాష్ట్ర సాధన తర్వాత ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, వ్యవసాయం రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి, పురోగతి దిశగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తోందని చెప్పారు. అలుపెరుగని స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి కొనసాగుతూ ఓ శక్తిగా ఎదుగుతుందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి ఈ సందర్భంగా గవర్నర్‌ నివాళులర్పించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment