Saturday, April 23, 2022

బీజేపీ కార్పొరేటర్ లకు కిషన్ రెడ్డి క్లాస్....!

*బీజేపీ కార్పొరేటర్ లకు కిషన్ రెడ్డి క్లాస్....!*

హైదరాబాద్‌: బీజేపీ కార్పొరేటర్లకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి క్లాస్ పీకారు. బీజేపీ ఆఫీస్‌లో బీజేపీ కార్పొరేటర్లతో కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు.
కొత్త భవన నిర్మాణాల జోలికి వెళ్లోద్దని, ఈ విషయంపై తనకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. సోషల్‌ మీడియాలో కార్పొరేటర్లు యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. స్థానిక సమస్యలపై కార్పొరేటర్లు పోరాటం చేయాలని ఆదేశించారు. కార్పొరేటర్లు కష్టపడి పనిచేయాలన్నారు. హైదరాబాద్‌కు కేంద్రం ఏం చేసిందో ప్రజలకు వివరించాలని కిషన్‌రెడ్డి సూచించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment