Sunday, April 24, 2022

రెండోరోజు కూడా సీఎం కేసీఆర్ తో.... ప్రశాంత్ కిషోర్ చర్చలు....!

*రెండోరోజు కూడా సీఎం కేసీఆర్ తో.... ప్రశాంత్ కిషోర్ చర్చలు....!*

హైదరాబాద్: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండో రోజు ఆదివారం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరిపారు. రెండు రోజులుగా ఆయన ప్రగతిభవన్ లో కేసీఆర్ తో గంటల తరబడి చర్చలు జరుపుతున్నారు.అందులో భాగంగానే ఆదివారం కూడా ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో పీకే సమావేశమయ్యారు.జాతీయ రాజకీయాల్లో కలిసి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తీరుపై ప్రశాంత్ కిషోర్ టీమ్ తెలంగాణలో సర్వేలు చేస్తున్నాయి.శనివారం నుంచి ప్రగతిభవన్‌లోనే పీకే మకాం వేశారు. వరుస సమావేశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంి.ఇప్పటికే రాజకీయ, పాలన పరిస్థితులపై పీకే టీమ్‌ సర్వే నిర్వహించినట్టు సమాచారం.కాంగ్రెస్‌ హైకమాండ్‌తో కూడా ప్రశాంత్ కిషోర్ టచ్‌లో ఉన్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment