Friday, April 1, 2022

రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు.... హాజరైన రాజకీయ ప్రముఖులు

*రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు.... హాజరైన రాజకీయ ప్రముఖులు*

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శ్రీశుభకృత్‌ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు ప్రజలందరూ ఉగాది పండుగను ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీశుభకృత్ నామ సంవత్సరం తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని.. ఆ వెలుగు ప్రజలకు శుభప్రదంగా, సంతోషమయంగా ఉండాలని కోరుకున్నారు. తెలుగు వారికి ప్రత్యేకమైన ఉగాది పండుగను కుటుంబసభ్యులతో కలిసి అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు.

రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. రాజ్‌భవన్‌లో వేడుకలకు సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు గైర్హాజరయ్యారు. ఉగాది వేడుకలకు రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి వేడుకలకు హాజరయ్యారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment