Saturday, April 23, 2022

కేటీఆర్‌ హద్దు మీరారు..!

కేటీఆర్‌ హద్దు మీరారు..!

Courtesy by : తొలివెలుగు మీడియా website

జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు

మోడీపై కేటీఆర్ హద్దు మీరి మాట్లాడారు. బీజేపీ అంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు భయం పట్టుకుంది. కేటీఆర్ వ్యాఖ్యలను చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నా.. ఇలాంటి విమర్శలు చేయడం సరికాదు.

మోడీ, బీజేపీ, కేంద్రాన్ని దూషిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కేటీఆర్ కు, పలు పేపర్‌ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చాం. ప్రధానమంత్రిపై తప్పుడు వార్తలు ప్రచురించారని ప్రివిలేజ్ నోటీస్‌ ఇచ్చాం.

తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని కొందరు ప్రాంతీయ పార్టీల నేతలు కంగారు పడుతున్నారు. బీజేపీ అంటే భయంతోనే కేటీఆర్ మాట్లాడినట్లు అనిపిస్తోంది. ప్రజాస్వామ్యానికి కుటుంబ పార్టీల నుంచి ముప్పు ఉంది.కుటుంబ పార్టీల పాలన దూరం చేసేలా.. 2024 ఎన్నికల ఎజెండాను ప్రధాని మోడీ ఖరారు చేశారు. టీఆర్ఎస్, వైసీపీలను పీకే కాంగ్రెస్ లో కలుపుతారా? కాంగ్రెస్ లో పీకే చేరికతో బీజేపీకి వచ్చే నష్టమేమీ ఉండదు.

No comments:

Post a Comment