Wednesday, April 6, 2022

పోలీసుల పై రెచ్చిపోయిన మరో ఎంఐఎం కార్పొరేటర్

*పోలీసుల పై రెచ్చిపోయిన మరో ఎంఐఎం కార్పొరేటర్*

హైదరాబాద్ బోలక్‌పూర్‌లో కార్పొరేటర్‌ గౌసుద్దీన్ ఘటన మరువక ముందే..మరో MIM కార్పొరేటర్ పోలీసులపై రెచ్చిపోయారు. పాతబస్తీలోని యునాని హాస్పిటల్ ముందు అర్ధరాత్రి హంగామా సృష్టించారు.యునాని హాస్పిటల్‌ ముందు కొందరు వ్యక్తులు వెహికిల్స్ పార్క్ చేశారు. ఇబ్బందిగా మారడంతో పలువురు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెహికిల్స్ తొలగించేందుకు అక్కడకు వచ్చిన పోలీసులతో MIM కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రి వాగ్వాదానికి దిగారు. ఎన్నో ఏళ్లుగా ఇలాగే పార్కింగ్ చేస్తున్నామంటూ ఆయన గొడవకు దిగారు. అంతేకాకుండా పోలీసులకి ఫిర్యాదు చేసిన యునాని హాస్పిటల్‌ సిబ్బంది పై కూడా సయ్యద్ మండిపడ్డారు.

link Media ప్రజల పక్షం🖋️

No comments:

Post a Comment