Tuesday, April 12, 2022

క‌ష్ట ప‌డ్డ వారికే.. పార్టీ టికెట్.. బండి సంజయ్

క‌ష్ట ప‌డ్డ వారికే.. పార్టీ టికెట్

Courtesy by : తొలివెలుగు మీడియా website

బీజేపీలో క‌ష్ట ప‌డ్డ‌వారికే ఫ‌లితం ద‌క్కుతోంద‌ని వ్యాఖ్యానించారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. ముఖ్యమంత్రులవుతామని చెప్పుకునే వారెవ‌రూ సీఎంలు కాలేర‌ని స్పష్టం చేశారు. తాను పార్టీ అధ్యక్షుడైనప్పటికీ.. తన టికెట్ పై కూడా స్పష్టత లేదని ఖరాఖండిగా చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికే ఎన్నికల్లో టికెట్ల ద‌క్కుతాయ‌ని తేల్చిచెప్పారు.

వ్యక్తుల కోసం పనిచేసేవారికి టికెట్లు రావన్నారు. టికెట్లు ఇప్పిస్తామని కొందరు నాయకులు వెంట‌ తిప్పుకుంటున్నారని.. అలా తిప్పుకున్న వారికి తిరిగిన వారికి ఇద్దరికీ సీట్లు రావని తేల్చి చెప్పారు. బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కూడా ఇదే విషయం చెప్పారని పేర్కొన్నారు.

దీనికి ముందు పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులతో సంజయ్​ సమావేశమయ్యారు. ఈనెల 14 నుంచి జోగులాంబ గద్వాల్ జిల్లాలో రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభం కానున్న నేపథ్యంలో యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

రైతుల ముసుగులో దాడులు చేయించి యాత్రను భగ్నం చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం రాళ్ల దాడులనైనా భరించేందుకు సిద్ద‌మేన‌న్నారు. ఎన్ని దాడులు జ‌రిగినా బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఎదురు దాడుల‌కు పాల్ప‌డొద్ద‌ని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా.. అక్రమ కేసులతో భయపెట్టాలని చూసినా బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించి తీరుతామని పునరుద్ఘాటించారు బండి సంజ‌య్.

No comments:

Post a Comment