Saturday, April 2, 2022

అర్ధరాత్రి పబ్ పై దాడులు..... పోలీసుల అదుపులో ప్రముఖ సింగర్......!

*అర్ధరాత్రి పబ్ పై దాడులు..... పోలీసుల అదుపులో ప్రముఖ సింగర్......!*

హైదరాబాద్ : బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఫుడింగ్ మింగ్ పబ్ సమయానికి మించి నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.దీంతో యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని బంజారాహిల్స్ పీఎస్‌కి తరలించారు.అయితే ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పోలీసులు పబ్​పై దాడులు నిర్వహించారు. పట్టుబడిన యువకులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా వారు స్టేషన్‌లో హంగామా సృష్టించారు. తమను ఎందుకు స్టేషన్‌కు తీసుకువచ్చారంరంటూ ఆందోళనకు దిగారు. అయితే, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రముఖ టాలీవుడ్‌ సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ సహా పలువురు ప్రముఖుల కుమారులు కూడా ఉన్నారు.

రైడ్స్‌ అనంతరం పబ్‌ నిర్వాహకులు అభిషేక్‌ ఉప్పల్‌, అనిల్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఫుడింగ్‌ మింగ్‌ పబ్‌ను సీజ్‌ చేశారు. కాగా, పబ్‌లో డ్రగ్స్‌ వినియోగిస్తున్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment