Saturday, May 22, 2021

ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిపై భూకబ్జా ఫిర్యాదు.. విచారణకు సీఎం ఆదేశం

హైదరాబాద్ : 23/05/2021

ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిపై భూకబ్జా ఫిర్యాదు.. విచారణకు సీఎం ఆదేశం

ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిపై భూకబ్జా ఫిర్యాదు.. విచారణకు సీఎం ఆదేశం


హైదరాబాద్‌ : భూకబ్జా వ్యవహారాల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబ సభ్యులపై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఈటల బాగోతం మరువకముందే ఆయన కుమారుడిపైనా ఇదే తరహా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈటల రాజేందర్‌ కుమారుడు నితిన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని ఓ బాధితుడు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశాడు. మేడ్చల్‌ మండలం రావల్‌కోల్‌ గ్రామానికి చెందిన మహేశ్‌ అనే వ్యక్తి నితిన్‌ రెడ్డి కబ్జాలపై సీఎంకు ఫిర్యాదు అందించారు.

తన భూమిని నితిన్‌రెడ్డి చెర నుంచి రక్షించి తనకు న్యాయం చేయాలని మహేశ్‌ దరఖాస్తులో పేర్కొన్నారు. దీంతో తక్షణమే విచారణ ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు సీఎం సూచించారు. వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ, అవినీతి నిరోదకశాఖ, విజిలెన్స్‌ అధికారులను సీఎం ఆదేశించారు.

No comments:

Post a Comment