Friday, May 21, 2021

కరోనా: ఆయుర్వేద మందు పంపిణీ తాత్కాలికంగా నిలిపివేత

హైదరాబాద్ : 21/05/2021

కరోనా: ఆయుర్వేద మందు పంపిణీ తాత్కాలికంగా నిలిపివేత

సాక్షి మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)


సాక్షి, నెల్లూరు : కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందు పంపిణీ తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని ఈరోజు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి  చేపట్టారు. మందుకోసం జనం పోటెత్తడంతో మందు పంపిణీ కష్టంగా మారింది. భౌతిక దూరం లేకుండా క్యూ లైన్‌లు కడుతుండటంతో తాత్కాలికంగా పంపిణీ నిలిపివేస్తూనట్టు నిర్వాహకులు ప్రకటించారు. మళ్ళీ పంపిణీ తేదీ పకటిస్తామని నిర్వహకులు తెలిపారు. అయితే రేపటి నుండి విశాలామైన గ్రౌండ్‌లో  ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాకాని ఆదేశించారు.

 


No comments:

Post a Comment