Tuesday, May 18, 2021

రాష్ట్రంలో ఆయుష్మాన్ భార‌త్ అమ‌లుకు ఎంఓయూ

హైదరాబాద్ : 18/05/2021

రాష్ట్రంలో ఆయుష్మాన్ భార‌త్ అమ‌లుకు ఎంఓయూ

రాష్ట్రంలో ఆయుష్మాన్ భార‌త్ అమ‌లుకు ఎంఓయూ

కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) పథకంలో చేరాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకుంది. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఖారారు చేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఈమేరకు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎ.ఎం. రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవోకు అమలుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.

No comments:

Post a Comment