Wednesday, December 21, 2022
అతను ఓ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి..ఈ పైత్యం ఇంకా ఎన్నాళ్ళు.?
Tuesday, December 20, 2022
కరినగర్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి
We want traffic signals.
కరినగర్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలనీ 3 సంవత్సరాలుగా పోరాడుతున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. 2019 నుండి అప్పటి సీపీ కమలాసన్ రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ ఐఏఎస్ గారు ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తాం సిగ్నల్స్ ఏర్పాటు చేస్తాం అని చెప్తూ వోచారు ఇప్పటి మేయర్ తదితరులు కూడా అదే మాట చెప్తున్నారు కానీ పని మాత్రం జరగడం లేదు. పైగా అనవసరంగా కూడలిలలో అడ్డం పొడవు పెద్ద పెద్ద సర్కిల్స్ ఏర్పాటు చేసి వాటిని మల్లి మల్లి చిన్నగా చేయడం ప్రజా దానం వృధా చేయడం దారుణం. ఇప్పుడు కూడా గీతాభవన్ చౌరస్థా 1 టౌన్ ముందు మల్లి సర్కిల్స్ చిన్నగా చేసే పని పెట్టుకున్నారు. ఆ పనిలో పని సిగ్నల్స్ ఏర్పాటు చేయవలసిందిగా బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి తోట శివ శంకర సాయినాథ రావు డిమాండ్ చేస్తూ బస్టాండ్ చౌరస్తా లో నిరసన చేపట్టడం జరిగింది అధికారులు పట్టించుకోని యెడల రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమం చేయవలసి ఉంటుంది అని హెచ్చరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో శివ శంకర సాయినాథ రావు తో పాటు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన కిరణ్ గారు, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ( కరీనగర్ bjym అసెంబ్లీ ఇంచార్జీ) ధీరజ్, నీకేష్, సాయి కిరణ్, మని తేజ, సాయి చరణ్ తేజ్, రాజేష్ , సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్ లో మేయర్ విజయలక్ష్మి కీ నిరసన సెగ....!
*ఉప్పల్ లో మేయర్ విజయలక్ష్మి కీ నిరసన సెగ....!*
హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఉప్పల్ నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. చిలుకానగర్ డివిజన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో రసాభాస చోటుచేసుకుంది.మేయర్ విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్కు సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిని పిలవకుండా ఎలా శంకుస్థాపనలు చేస్తారంటూ మేయర్ విజయలక్ష్మిని స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మేయర్ ప్రోటోకాల్ పాటించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేయర్ విజయలక్ష్మి తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే అనుచరులు, మేయర్ వర్గం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు వర్గాలు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నాయి. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ నిధులతో చేస్తున్న కార్యక్రమాలకు ఎమ్మెల్యేను పిలవాల్సిన అవసరం లేదంటూ ఆగ్రహించారు. ప్రోటోకాల్తో తనకు సంబంధం లేదని, అది అధికారుల పనంటూ శంకుస్థాపన చేయకుండానే మేయర్ వెనుదిరిగారు.
*సుజీవన్ వావిలాల*🖋️
Monday, December 19, 2022
ఎమ్మెల్యేల సమావేశంపై అధిష్టానం.... ఆరా
*ఎమ్మెల్యేల సమావేశంపై అధిష్టానం.... ఆరా*
హైదరాబాద్: ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు నిర్వహించిన సమావేశంపై అధిష్ఠానం ఆరా తీసింది. సమావేశంలో చర్చించిన అంశాలు, వారు మీడియాతో మాట్లాడుతూ చేసిన విమర్శలను విశ్లేషించింది. వాస్తవంగా మైనంపల్లి ఇంట్లో విందుకే వారంతా హాజరయ్యారని, తర్వాత మల్కాజిగిరి ఎంపీ స్థానానికి భారాస అభ్యర్థిత్వం కోసం మద్దతు సమీకరించే క్రమంలో మైనంపల్లి సమావేశం నిర్వహించారని అధిష్ఠానం తెలుసుకుంది. ఈ భేటీకి మంత్రి మల్లారెడ్డిపై అసమ్మతి కూడా కారణమనే అంచనాకు వచ్చింది. ఈ పరిణామాలపై చర్చించేందుకు త్వరలోనే మంత్రి, ఎమ్మెల్యేలకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
*సుజీవన్ వావిలాల*🖋️
ఆయన మేడ్చల్ కే మంత్రి కాదు....మల్లారెడ్డి పై 5 గురు ఎమ్మెల్యేల అసంతృప్తిగళం...!
*ఆయన మేడ్చల్ కే మంత్రి కాదు....మల్లారెడ్డి పై 5 గురు ఎమ్మెల్యేల అసంతృప్తిగళం...!*
హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తగళం వినిపించారు. పదవులన్నింటినీ సొంత నియోజకవర్గం మేడ్చల్కే తీసుకెళ్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.దూలపల్లిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో ఐదుగురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప్పల్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు బేతి సుభాష్రెడ్డి, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, వివేకానంద్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ తమ సమావేశానికి ప్రత్యేక కారణం లేదంటూనే మంత్రి మల్లారెడ్డి వైఖరిని తప్పుబట్టారు. నామినేటెడ్ పదవులన్నీ మేడ్చల్కే తీసుకెళ్తున్నారని.. తమ నియోజకవర్గాల కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడాలని సీఎం కేసీఆర్ పదేపదే చెప్పినా మంత్రి ఇలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. వచ్చిన వాళ్లకే పదవులు వస్తున్నాయని.. ప్రొటోకాల్ కూడా పాటించడం లేదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అసహనం వ్యక్తం చేశారు. ఒక్కో వ్యక్తి మూడు నాలుగు పదవులు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. పదవులు వచ్చిన వాళ్లకే మళ్లీ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. '' పార్టీ కార్యకర్తలకు పదవులు రావాలనే మేం అడుగుతున్నాం. కొన్ని అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకే మేం మాట్లాడుతున్నాం. కొందరు మంత్రులు వాళ్ల వ్యక్తులకే నాలుగు పదవులు ఇప్పించుకుంటున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు మమ్మల్ని నిలదీస్తున్నారు. మంత్రుల వ్యక్తులకే పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు.'' అని అసహనం వ్యక్తం చేశారు. తమ సమస్యకు కారణమే మంత్రి మల్లారెడ్డి.. మళ్లీ ఆయన్ను ఎలా పిలుస్తామని అన్నారు. కొత్త వ్యక్తులకు పదవులు ఇస్తే అభినందిస్తామన్నారు. సమావేశం అంతర్గత విషయాలు బయటకు వెళ్లాయని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. మాపై పార్టీ వ్యతిరేక ముద్ర వేసేందుకు ఎవరో కుట్ర చేశారని ఆయన తెలిపారు. జిల్లా నాయకత్వం వైఫల్యాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు
*సుజీవన్ వావిలాల*🖋️