*నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, అరుదైన రాయి పేరిట మోసం — ఆరుగురిని అరెస్ట్ చేసిన టాస్క్ఫోర్స్*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 17:
నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, మహిమలు ఉన్నాయంటూ ప్రచారం చేసిన ఒక రాయిని అధిక ధరలకు విక్రయించి అమాయకులను మోసం చేసేందుకు యత్నిస్తున్న ఆరుగురి ముఠాను జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ఫోర్స్ మరియు మైలార్దేవ్పల్లి పోలీసులు ఉమ్మడిగా దాడి చేసి పట్టుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు. శనివారం (15-08-2026) రోజున కాటేదాన్లోని లక్ష్మిగూడ ప్రాంతంలో కొనుగోలుదారుల కోసం వేచి చూస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి నిర్వహించారు.
**కేసు పూర్వాపరాలు:**
పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం — మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేటకు చెందిన కేతావత్ రాజు అలియాస్ కట్టప్ప, మైలార్దేవ్పల్లి ప్రాంతానికి చెందిన పి. నరసింహ, వడత్య కుమార్, ప్రవీణ్ సింగ్, మంగళి బసవ నరేష్ మరియు వేములవాడకు చెందిన సిద్ధాంతి చల్లా రవి ఒక ముఠాగా ఏర్పడ్డారు.2024లో పి. నరసింహ అనే వ్యక్తి వేములవాడకు చెందిన చల్లా రవి, కొండపల్లి భిక్షపతి వద్ద నుంచి నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహాన్ని రూ. 10,00,000లకు కొనుగోలు చేసి మోసపోయాడు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని వడత్య కుమార్కు అందజేశాడు. దాంతో తామంతా ఒక గుంపుగా ఏర్పడి, ఆ నకిలీ విగ్రహానికి దివ్యశక్తులు ఉన్నాయని, అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్మబలికి అమాయకులకు భారీ ధరలకు విక్రయించాలని ప్లాన్ చేశారు.
ఇదే సమయంలో కేతావత్ రాజు తన వద్ద ఒక అరుదైన గులాబీ రంగు రాయి ఉందని, దాన్ని కూడా అధిక ధరకు విక్రయించవచ్చని భావించి ముఠాలో చేరాడు. శనివారం కాటేదాన్, లక్ష్మిగూడ సమీపంలో ఈ నకిలీ విగ్రహం మరియు రాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.
**అరెస్ట్ అయిన నిందితులు:**
*(1)*: కేతావత్ రాజు అలియాస్ కట్టప్ప (38): కార్ డ్రైవర్, చౌదూర్ (గ్రామం), నవాబ్పేట, మహబూబ్నగర్ జిల్లా.
*(2)*: వడత్య కుమార్ (34): కార్ డ్రైవర్, లక్ష్మిగూడ, కాటేదాన్, హైదరాబాద్.
*(3)*: ప్రవీణ్ సింగ్ (34): డ్రైవర్, మధుబన్ కాలనీ, కాటేదాన్, హైదరాబాద్.
*(4)*: మంగళి బసవ నరేష్ (38): కార్మికుడు, లక్ష్మిగూడ, కాటేదాన్, హైదరాబాద్.
*(5)*: పి. నరసింహ (45): కార్ డ్రైవర్, లక్ష్మిగూడ, కాటేదాన్ (స్వస్థలం: లోయపల్లి, మంచాల్, రంగారెడ్డి జిల్లా).
*(6)*: చల్లా రవి (38): జోతిష్యుడు, చీర్లవంచ, వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా.
**స్వాధీనం చేసుకున్న సొత్తు:**
*(1)*: ఒక నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం
*(2)*: ఒక గులాబీ రంగు రాయి (Pink Colour Stone)
*(3)*: ఎర్టిగా (Ertiga) వాహనం (TS 04 B 0549)
*(4)*: ఐదు మొబైల్ ఫోన్లు
*(5)*: మూడు రసాయన ద్రావణాల బాటిళ్లు (Unknown Liquid Bottles)
*(6)*: రెండు ఎరుపు రంగు తువాళ్లు.
జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఛెత్రి యాదేందర్, సబ్-ఇన్స్పెక్టర్ జి. సందీప్ రెడ్డి బృందం మైలార్దేవ్పల్లి పోలీసులతో కలిసి ఈ అపరేషన్ నిర్వహించారు. నిందితులను స్వాధీనం చేసుకున్న సొత్తుతో సహా తదుపరి విచారణ నిమిత్తం మైలార్దేవ్పల్లి పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ (SHO)కు అప్పగించారు.
No comments:
Post a Comment