Tuesday, December 20, 2022

కరినగర్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి

We want traffic signals.

కరినగర్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలనీ 3 సంవత్సరాలుగా పోరాడుతున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. 2019 నుండి అప్పటి సీపీ కమలాసన్ రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ ఐఏఎస్ గారు ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తాం సిగ్నల్స్ ఏర్పాటు చేస్తాం అని చెప్తూ వోచారు ఇప్పటి మేయర్ తదితరులు కూడా అదే మాట చెప్తున్నారు కానీ పని మాత్రం జరగడం లేదు. పైగా అనవసరంగా కూడలిలలో అడ్డం పొడవు పెద్ద పెద్ద సర్కిల్స్ ఏర్పాటు చేసి వాటిని మల్లి మల్లి చిన్నగా చేయడం ప్రజా దానం వృధా చేయడం దారుణం. ఇప్పుడు కూడా గీతాభవన్ చౌరస్థా 1 టౌన్ ముందు మల్లి సర్కిల్స్ చిన్నగా చేసే పని పెట్టుకున్నారు. ఆ పనిలో పని సిగ్నల్స్ ఏర్పాటు చేయవలసిందిగా బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి తోట శివ శంకర సాయినాథ రావు డిమాండ్ చేస్తూ బస్టాండ్ చౌరస్తా లో నిరసన చేపట్టడం జరిగింది అధికారులు పట్టించుకోని యెడల రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమం చేయవలసి ఉంటుంది అని హెచ్చరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో శివ శంకర సాయినాథ రావు తో పాటు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన కిరణ్ గారు, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ( కరీనగర్ bjym అసెంబ్లీ ఇంచార్జీ) ధీరజ్, నీకేష్, సాయి కిరణ్, మని తేజ, సాయి చరణ్ తేజ్, రాజేష్ , సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment