Friday, December 16, 2022

ఉభయ రాష్ట్రాల మానవ హక్కుల వేదిక 9వ.మహాసభలు,

మిత్రులకు,
నమస్తే.
ఉభయ రాష్ట్రాల  మానవ హక్కుల వేదిక 9వ.మహాసభలు,
*డిసెంబర్ 17,18 వ* తేదీలలో నిజామాబాద్ లో జరుగుతాయి.
కార్యక్రమం:
*రెండు రాష్ట్రాల ఆఫీస్ bearers 16వతేదీన నే (శుక్ర వారం) నిజామాబాద్ చేరుకుంటారు. 
ఆ రోజు ఉభయ రాష్ట్రాల పూర్తి ఎక్జిక్యూటివ్ సమావేశం ఉంటుంది.
అందులో ఉభయ రాష్ట్రాల మూడు సంవత్సరాల నివేదికను ప్రధాన కార్య దర్షులు ప్రవేశ పెడతారు.దానిపైన చర్చ జరిగిన తర్వాత,ఫైనల్ చేసి ఆ రోజు రాత్రి DTP చేయించి 18 న.జరిగే రెండు రాష్ట్రాల ప్రాథమిక సభ్యులకు అంద చేస్తారు.
*రాబోయే టర్మ్ కు రెండు రాష్ట్రాలకు సంస్థ బాధ్యులు అంటే ఆఫీస్ bearers ను సూచించి,ప్రతిపాదన తయారు చేస్తారు.ఈ ప్రతిపాదనలను 18న.జరిగే సర్వ సభ్య సమావేశంలో చర్చకు పెట్టీ approval తీసుకోవడం జరుగుతుంది.

**17,శని వారం నాడు,ముగ్గురు వక్తల ఉపన్యాసాలు ఉంటాయి.సాయంత్రం అయిదు గంటలకు నగరం లో ఊరేగింపు,తరవాత బహిరంగసభ ఉంటుంది.
వివరాలు కరపత్రం లో ఉన్నాయి.

***18 వ తేదీ,ఆదివారం సర్వ సభ్య సమావేశం ఉంటుంది.
అందులో రెండు రాష్ట్రాల కార్యదర్శులు రాష్ట్ర నివేదికలు సమర్పిస్తారు.
రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కార్యదర్శులు నివేదికలు సమర్పిస్తారు.
కార్యక్రమాలపై కొంత చర్చ ఉంటుంది.
తరవాత రెండు రాష్ట్రాల కొత్త బాడీల ప్రతిపాదన,ఎన్నిక ఉంటుంది.

సభ్యులు 17న,మరియు 18న తప్పకుండా ఉండి సభల్లో పాల్గొనాలి.
మన సిటీ నుండి ఇద్దరు సమన్వయ కమిటీ సభ్యులు, రాష్ట్ర ఉపాధ్య క్షుడి తో పాటు అందరు సభ్యులు హాజరు కావలి.
సభ్యులు తమ పేర్లను తెలిపితే అక్కడ బస ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
సభ్యులు వారి పేర్లను ఈ గ్రూప్ లో ఈ రోజు సాయంత్రం అనగా 10 డిసెంబర్ సాయంత్రం 5 గంటల కల్లా తెలియ చేయాలి.  5 గంటల వరకు వచ్చిన పేర్లను రాష్ట్ర వర్గానికి ఇవ్వడం జరుగుతుంది. 

ఆ రోజు వరకు చలి పెరుగుతుంది.
బెడ్స్ ఉంటాయి కానీ కప్పుకోవడానికి చెద్దర్(దుప్పటి),టూత్ పేస్ట్ వగైరా వెంట తెచ్చుకోవాలి.

మహిళా సభ్యులకు ప్రత్యేక బస ఏర్పాటు ఉంటుంది.
అభినందనలతో,
V.బాలరాజు,
నగర కమిటీ ప్రధాన కార్యా దర్శి.
*సంజీవ్,
*Bilal
నగర కమిటీ సభ్యులు

No comments:

Post a Comment