Monday, December 19, 2022

ఎమ్మెల్యేల సమావేశంపై అధిష్టానం.... ఆరా

*ఎమ్మెల్యేల సమావేశంపై అధిష్టానం.... ఆరా*

హైదరాబాద్‌: ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో మేడ్చల్‌ జిల్లా ఎమ్మెల్యేలు నిర్వహించిన సమావేశంపై అధిష్ఠానం ఆరా తీసింది. సమావేశంలో చర్చించిన అంశాలు, వారు మీడియాతో మాట్లాడుతూ చేసిన విమర్శలను విశ్లేషించింది. వాస్తవంగా మైనంపల్లి ఇంట్లో విందుకే వారంతా హాజరయ్యారని, తర్వాత మల్కాజిగిరి ఎంపీ స్థానానికి భారాస అభ్యర్థిత్వం కోసం మద్దతు సమీకరించే క్రమంలో మైనంపల్లి సమావేశం నిర్వహించారని అధిష్ఠానం తెలుసుకుంది. ఈ భేటీకి మంత్రి మల్లారెడ్డిపై అసమ్మతి కూడా కారణమనే అంచనాకు వచ్చింది. ఈ పరిణామాలపై చర్చించేందుకు త్వరలోనే మంత్రి, ఎమ్మెల్యేలకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment