Saturday, September 24, 2022

Bathukamma festivities..... @KCR


Chief Minister Sri K. Chandrashekar Rao extended greetings to the people of the State on the commencement of nine-day long #Bathukamma festivities.

Hon'ble CM said that the Bathukamma is celebrated with great fervour and gaiety by women at their maternal homes by arranging the flowers in a beautiful stack. The dance and songs around Bathukammas reflect the unique tradition of Telangana.The cultural extravaganza, that embeds praying the nature by women folk all through it, will be on full display across the State for nine days starting the 'Petharamasa'.
Bathukamma spread far and wide to all corners of the globe. And with it, the Telangana culture also proliferated to different continents. Pray Goddess of Nature, Bathukamma, to bestow the people of the State with happiness and good health: CM


Friday, September 23, 2022

రాంకీ సంస్థతో జిహెచ్ఎంసి కుదుర్చుకున్న ఒప్పందం విరమించుకోవాలని ఆందోళనకు దిగిన ఎఐటియుసి సిబ్బంది

పత్రికా ప్రకటన                24-09-2022
         రాంకీ సంస్థతో జిహెచ్ఎంసి 
కుదుర్చుకున్న ఒప్పందం విరమించుకోవాలని
  ఆందోళనకు దిగిన ఎఐటియుసి సిబ్బంది 
--------------------------------------------------------
సెప్టెంబర్ 24 హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి కార్మికుల శ్రమ దోపిడి కోసం రాంకీ సంస్థతో కుదుర్చుకున్న చికటి ఒప్పందాన్ని విరమించుకోవాలని, ఎండ, వాన, రాత్రి, పగలనక ప్రజా ఆరోగ్యాలకోసం పనిచేస్తున్న కార్మికుల గోస పట్టించుకోకుంటే, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనం 24 వేలు ఇవ్వకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మందా వెంకటేశ్వర్లు, కె.యేసురత్నం హెచ్చరించారు. శుక్రవారం జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ వరకు ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి పరిధిలో గల ఆరు జోన్ల కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందితో ప్రదర్శనగా వచ్చి జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ మేయిన్ గేట్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. అనంతరం జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా  మందా వెంకటేశ్వర్లు, కె.యేసురత్నం మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని అన్ని రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఇచ్చిన హామీని గుర్తుచేశారు. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ మాట పక్కన పెడితే కనీస వేతనాలు అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. ముఖ్యంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు శ్రమ దోపిడకి గురౌతున్నారని గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి లో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు చికటి ఒప్పందాన్ని చేసుకొని రాంకి అనే సంస్థతో జిహెచ్ఎంసి చేతులు కలిపడం జిహెచ్ఎంసి పరిధిలో పారిశుద్ధ్య పనులు చేయించడం పట్ల కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బంది పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జిహెచ్ఎంసి లో మలేరియా విభాగంలో గతంలో దోమల మందు పిచికారి చేయడానికి ఇద్దరు సిబ్బంది ఉండెవారని ఇప్పుడు ఇద్దరు చేసే పని ఒక్కరితోనే సక్కబెడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని పాత పద్ధతిలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. జిహెచ్ఎంసి లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందితో ప్రభుత్వం గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాలని కోరారు. అదేవిధంగా గ్రూపుల్లో 7గురు కార్మికులు ఉండాలి కాని కొన్ని గ్రూపుల్లో 3 లేదా 4 గురు మాత్రమే ఉన్నారని ప్రతి గ్రూపులో 7 గురు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అన్ని సర్కిల్ లలో పనిచేస్తున్న సిబ్బందికి సేఫ్టీ పరికరాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రవిచంద్ర, ముడి మార్టిన్, నాయకులు సుధాకర్,డి.రాములు, పి.హరినాద్, ఆనంద్, చిరంజీవి, మహేందర్,డి.ఎం.శేఖర్, నీలమ్మ, అనితా,లక్షమమ్మ, వీణా,కలమ్మ, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

అజారుద్ధీన్ పై మానవ హక్కుల కమిషన్ లో కంప్లైంట్.

పీర్జాదిగూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్కు స్థలం కబ్జా

*పీర్జాదిగుడ మున్సిపల్ కార్పొరేషన్ 1 వ డివిజన్ లొ పార్కు కబ్జా చేసి చెర్రీస్ స్వచ్చంద సంస్థ చేపడుతున్న అక్రమ నిర్మాణంలో మేయర్, కమిషనర్ వాటా ఎంత...బీఎస్పీ కార్పొరేషన్  అధ్యక్షుడు ఇటికాల అంబేద్కర్*

*విషయం:* *పీర్జాదిగూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేయర్ గారి ఇలాకాలలో 1వ వార్డులోని సర్వే నెం 29లొ గల శ్రీసాయి నగర్ కాలనీ లొ గల పార్కు స్థలం కబ్జా చేసి చెర్రీస్ అనే  ఒక స్వచ్చంద సంస్థ నడుపుతున్న వ్యక్తి భవన నిర్మాణం చేపడుతున్న విషయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ  పీర్జాదిగూడా కార్పొరేషన్ అధ్యక్షులుఇటికాల అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో  పార్కు స్థలాన్ని తేది 6:03:2022 నాడు పరిశీలించి కమిషనర్ గారి దృష్టికి మేయర్ గారి దృష్టికి తీసుకొచ్చాము..కాని ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఇదే పార్కులో గౌరవ మంత్రి మల్లారెడ్డి గారు పట్టన  ప్రగతి కార్యక్రమంలో కొన్ని వందల మొక్కలు నాటారు. కానీ ఇప్పటివరకు  ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఈ వ్యవహారంపై కొంత మంది రాజకీయ నాయకులు ప్రముఖ mlc గారి  అండదండలతో ఈ వ్యవహారం చాపకింద నీరులా మారి ఈ రోజుకి 2nd ప్లోర్ స్లాబ్ అక్కడ నిర్మాణం జరిగింది.తెలంగాణ మున్సిపల్ యాక్ట్  2019 సెక్షన్ 24 ప్రకారం పార్కు ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రభుత్వంలో ఉన్న మేయర్ గారు కమిషనర్ గారు ప్రభుత్వ అధికారులు ఎందుకు చూసి చూడనట్టు వుంటున్నారు.మరి ఇందులో మేయర్,కమిషనర్ వాట ఎంత ప్రజలకు తెలియాల్సిన అవసరం వుంది.మీ వాట లేకుంటే తక్షణం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.గత రెండు రోజులుగా అక్కడ నిర్మాణం చేపడుతున్న చెర్రీస్ ఫౌండేషన్ వ్యక్తి ,ఎలక్ట్రాన్ మీడియా వారికీ ఫోన్ పే,గూగుల్ పే ద్వారా డబ్బులు ఇచ్చినట్టు అతను మాట్లాడుతున్న వాయిస్  తో కొన్ని మీడియా ఛానళ్లలో,పత్రికలలో వార్తలు వచ్చాయి..మరి అది అతని సొంత భూమి ఐతే మీడియా వారికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది.కావునా మీరు ఇప్పటికైనా పార్కు స్థలాన్ని సర్వే చేయించి అక్కడ జరుగుతున్న నిర్మాణాలను ఆపేసి తగు చర్యలు తీసుకోని పార్కు స్థలాన్ని కాపాడాలని బహుజన్ సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో ఈ కబ్జాల వ్యవహారాన్ని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ గారి దృష్టికి కలెక్టర్ గారి మరియు CDMA కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి పెద్దఎత్తున ఆందోళనలు చేసి మున్సిపల్ ఆఫీస్ కలెక్టరేట్ ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం*

   *జై భీమ్ జై భారత్*

        *భవదీయ*
*ఇటికాల అంబేద్కర్*
        *అధ్యక్షులు*
        *BSP-PMC*
        *🐘💺🐘*

ఈడీ ఝలక్.... నేషనల్ హెరాల్డ్ కేసులో టీ కాంగ్రెస్ నేతలకు నోటీసులు

*ఈడీ ఝలక్.... నేషనల్ హెరాల్డ్ కేసులో టీ కాంగ్రెస్ నేతలకు నోటీసులు*

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో​ టీకాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో భాగంగా షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌ రెడ్డికి నోటీసులు అందినట్టు సమాచారం.కాగా, ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీని ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నోటీసులపై కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ స్పందించారు. శుక్రవారం షబ్బీర్‌ అలీ మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. నోటీసులు వస్తే మాత్రం విచారణకు హాజరవుతాను అని స్పష్టం చేశారు

*సుజీవన్ వావిలాల*🖋️ 

Thursday, September 22, 2022

పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల సంఘం కీలక సిఫార్సు.....!

*పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల సంఘం కీలక సిఫార్సు.....!*


దిల్లీ: ఎన్నికల సమయంలో పోస్టల్‌ బ్యాలెట్లు  అవకాశం ఉందని భావిస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పులకు సిద్ధమైంది. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌కు బదులుగా అదే కేంద్రంలో తమ బ్యాలెట్‌ను సమర్పించే వెసులుబాటును కల్పించాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని సిఫార్సు చేస్తూ ఎన్నికల సంఘం తాజాగా కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసింది.

పోలింగ్‌ విధులు నిర్వర్తించే సిబ్బంది తమకు ఇచ్చిన పోస్టల్‌ బ్యాలెట్లను వినియోగించుకోకుండా తమవెంటే పెట్టుకున్నట్లు గతంలో జరిగిన ఎన్నికల్లో గుర్తించాం. నిబంధనల ప్రకారం కౌంటింగ్‌ తేదీన ఉదయం 8 గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ అందజేయవచ్చనే ఆలోచనతో వాటిని సిబ్బంది తమతోనే ఉంచుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో విధులు ముగిసిన తర్వాత పోస్టల్‌ బాలెట్లను సిబ్బంది తమతోపాటే ఇంటికి తీసుకెళ్లడంపైనా ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. 1951 నాటి ప్రజాప్రతినిధ్య చట్టం, 1961 ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్‌ 18 ప్రకారం కౌంటింగ్‌ తేదీన ఉదయం వరకు పోస్టల్‌ బ్యాలెట్లను అనుమతిస్తారు. ఇలా గత రెండేళ్లలో గోవా, కేరళ, మణిపూర్‌లలో జరిగిన ఎన్నికల్లో దాదాపు 50శాతానికి పైగా పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చినట్లు వెల్లడైంది.

ఈ నేపథ్యంలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌కు బదులుగా ఆ కేంద్రంలోనే ఓటును వినియోగించుకోవడంపై సెప్టెంబర్‌ 16న జరిగిన సమావేశంలో భారత ఎన్నికల ప్రధాన అధికారి (CEC) రాజీవ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్రపాండేలు నిర్ణయించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర న్యాయశాఖకు ఎన్నికల సంఘం లేఖలో సిఫార్సు చేసింది.

ఇప్పటి వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది శిక్షణ సమయంలోనే ఆయా రిటర్నింగ్‌ అధికారిని సంప్రదించి పోస్టల్‌ బ్యాలెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అనంతరం వారికి పోలింగ్‌ స్టేషన్‌ కేటాయించే ముందే వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలెట్లను అందజేస్తారు. ఈ క్రమంలోనే పోస్టల్‌ బ్యాలెట్లు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని గుర్తించిన ఎన్నికల సంఘం ఈ విధానంలో మార్పులు తెచ్చేందుకు సిద్ధమైంది.

*సుజీవన్ వావిలాల*🖋️

Tuesday, September 20, 2022

దసరా సెలవులు తగ్గించండి

దసరా సెలవులు తగ్గించండి

 
దసరా సెలవులు తగ్గించండి
  • విద్యాశాఖ డైరెక్టర్‌కు ఎస్సీఈఆర్టీ ప్రతిపాదన

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (నమస్తే తెలంగాణ): దసరా సెలవులు తగ్గించడం లేదా రెండో శనివారాల్లోనూ పాఠశాలలను నడిపేందుకు అనుమతించాలని కోరుతూ ఎస్సీఈఆర్టీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ ఎం రాధారెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేనకు మంగళవారం లేఖరాశారు. భారీ వర్షాలతో జూలై 7 నుంచి 16 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతోపాటు జాతీయ సమైక్యత ఉత్సవాల నేపథ్యంలో 2022 -23 విద్యాసంవత్సరం 7 రోజులు నష్టపోయిందని లేఖలో ప్రస్తావించారు. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం మొత్తం పని దినాలు 230 కాగా, జరిగిన నష్టాన్ని పూరించేందుకు పై రెండు ప్రతిపాదనలను సమర్పించారు.

ప్రతిపాదనలివే..

  • అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 9 వరకు 14 రోజులు ప్రకటించిన దసరా పండుగ సెలవులను వాయిదావేసి తాజాగా అక్టోబర్‌ 1 నుంచి 9 వరకు 9 రోజుల పాటు రీషెడ్యూల్‌ చేసేందుకు అనుమతించాలి. దీంతో 5 పని రోజులు స్కూళ్లు నడిపి భర్తీచేయవచ్చని పేర్కొన్నారు.
  • రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లను రెండో శనివారాల్లోనూ నడిపేందుకు ఆదేశాలివ్వాలని కోరారు. ఇలా నవంబర్‌, డిసెంబర్‌, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలలో స్కూళ్లలో తరగతులు నిర్వహించడం ద్వారా ఐదు రోజులు కలిసివస్తుందని లేఖలో ప్రస్తావించారు.