Friday, September 23, 2022

ఈడీ ఝలక్.... నేషనల్ హెరాల్డ్ కేసులో టీ కాంగ్రెస్ నేతలకు నోటీసులు

*ఈడీ ఝలక్.... నేషనల్ హెరాల్డ్ కేసులో టీ కాంగ్రెస్ నేతలకు నోటీసులు*

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో​ టీకాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో భాగంగా షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌ రెడ్డికి నోటీసులు అందినట్టు సమాచారం.కాగా, ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీని ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నోటీసులపై కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ స్పందించారు. శుక్రవారం షబ్బీర్‌ అలీ మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. నోటీసులు వస్తే మాత్రం విచారణకు హాజరవుతాను అని స్పష్టం చేశారు

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment