Tuesday, June 21, 2022

మూసీ ఒడ్డు పై ఇండ్లు కోల్పోయిన వారికి పట్టాలు

హైదరాబాద్ జిల్లా సైదాబాద్ MRO ఆఫీస్,GHMC అఫ్జల్ నగర్ పరిధిలో గల తీగల గూడ లో పట్టాల పంపిణీ 

మూసీ ఒడ్డు పై 30 సంవత్స రాలు గా ఉనికిలో ఉన్న పేదల గుడిసెలు తీసివేసిన సంగతి గుర్తే ఉంటుంది.
అప్పుడు 132 కుటుంబాలకు ఇండ్లు ఇచ్చారు.
మిగతా 90 కుటుంబాల ఇండ్ల కోసం HRF నుండి BILAL, చత్రి సంస్థ నుండి నివాస హక్కుల కార్య కర్త హైమ విశేషం గా కృషి చేశారు.
ఈ రోజు మిగతా 90 కుటుంబాలకు గృహాలు కేటాయించిన పత్రాలు MIM,నాయకులు,మన కార్య కర్తల సమక్షం లో అంద చేయడం జరిగింది.
ఇది Bilal,Hyma ల కృషి పలితం.
HRF,రెండు రాష్ట్రాల కమిటీ ల తరపున వాళ్ళను అభి నందిద్దాం.
💐🌺🌷
Courtesy by : HRF (మానవ హక్కుల వేదిక)

సమాజం ఎన్నటికీ మరువని ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్

ప్రొఫసర్ సారూ మిమ్మల్ని యాదిమరిచేట్టు చేస్తున్న దొర..... కానీ మీరు తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ వుంటారు 🎉🙏...... Bplkm🪶 prajasankalpam1.blogspot.com 


*సమాజం ఎన్నటికీ మరువని ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్* 

*తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ 11వ వర్ధంతి వేడుకలు*

తెలంగాణ సింద్దాంత కర్త, తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ 11వ వర్ధంతి సందర్భంగా షాద్ నగర్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆయన విగ్రహానికి ఉద్యమ కారుల ఆధ్వర్యంలో పూలమాలకు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1952 నుంచి తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని తెలంగాణ సమాజంలో అవగాహన కల్పించడంతోపాటు మలిదశ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయ పక్షాలన్నింటినీ ఒప్పించడంలో కీలక భూమిక వహించిన ప్రొఫెసర్ జయశంకర్ ని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువ లేదని ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇద్రీస్, జెడ్పీటీసీ వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్,   సీనియర్ ఉద్యమ నేత రాజా వరప్రసాద్ రావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉద్యమ నాయకులు వంగూరు గంగిరెడ్డి మరియు నక్కల వెంకటేష్ గౌడ్,విద్యార్థి ఉద్యమనేతలు జాంగారి రవి, లక్ష్మణ్ నాయక్, మామిడిపల్లి శరత్, రాఘవేందర్, జూపల్లి శంకర్, మలినేని సాంబశివ రావు, బాలయ్య, మల్లయ్య యాదవ్, దిలీప్ కుమార్, ఇప్పల పల్లి సురేష్,  తదితరులు పాల్గొన్నారు.

link Media ప్రజల పక్షం 

Monday, June 20, 2022

విద్యాశాఖ లోని అవినీతి అధికారులు & ఉపాధ్యాయులు మీద యుద్ధం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ

*పత్రికా ప్రకటన*

*భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ*

విషయం:- ZPHS హెడ్మాస్టర్ సిహెచ్ సాంబయ్య,MPPS హెడ్మాస్టర్ స్వరూపరాణి, రామంతపూర్ ప్రభుత్వ పాఠశాలలో  విద్యార్థిని విద్యార్థుల దగ్గర నుండి అక్రమంగా వసూలు చేస్తున్న హెడ్మాస్టర్ ల సస్పెండ్ చెయ్యాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్. 

*అదనపు కలెక్టర్ ఏనుగుల నరసింహారెడ్డి గారికి*, విద్యాధికారి DEO గారికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

 ఈ సందర్భంగా *ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సంతోష్* మాట్లాడుతూ.....ZPHS హెడ్మాస్టర్ సిహెచ్ సాంబయ్య,  MPPS హెడ్మాస్టర్ స్వరూపరాణి, *రామంతపూర్ ప్రభుత్వ పాఠశాలలో*  విద్యార్థిని విద్యార్థుల దగ్గర నుండి అక్రమంగా వసూలు చేస్తున్న హెడ్మాస్టర్ ల పైన చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్. నూతనంగా అడ్మిషన్ అవుతున్న విద్యార్థినీ విద్యార్థులు దగ్గర నుండి తెలుగు మీడియం చదివే విద్యార్థుల అడ్మిషన్ ఫీజు 1000 నుండి 2000 వరకు వసూలు చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థులకు 5000 రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారు. టీసీ, బోనఫైడ్ 500 రూపాయలు ఇస్తేనే ఇస్తామనే కండిషన్ అయినా విధానం కాదు, యూనిఫామ్ టై బెల్టు కూడా డబ్బులు కట్టాలి. ప్రవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో డబ్బులు కట్ట లేకనే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ అవుతున్న స్టూడెంట్ లకు కూడా డబ్బులు వసూలు చేయడంతో అడ్మిషన్ కాకుండా గందరగోళంలో పడ్డారు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా డబ్బులు కట్టాలా అనే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే డబ్బులు కడితేనే అడ్మిషన్ అవ్వండి లేకపోతే అవ్వకండి అని చెప్పేసి హెడ్మాస్టరు హెచ్చరికలు విడుదల చేయడం ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పేద బడుగు బలహీన విద్యార్థులకు చదువు చెప్పవలసిన హెడ్మాస్టర్ ని ఈ విధంగా లంచాలకు పాల్పడితే పై అధికారులు ఏం చేస్తున్నట్లుగా అన్ని ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తుంది. హెడ్మాస్టర్ లను వెంటనే సస్పెండ్ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పై అధికారులకు తెలియజేసింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక కష్టనష్టాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు అండగా ఉండి నాణ్యమైన చదువు అందించాలి కానీ ఈ రకంగా లంచాలు ఇస్తేనే చదువు చెబుదామనే హెచ్చరికలు ప్రభుత్వ ఉపాధ్యాయులు చేయడం తీవ్రంగా ఖండిస్తోంది. హెడ్మాస్టర్లను సస్పెండ్ చేసే అంత వరకు రాబోయే రోజుల్లో పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సిపిఎం ఉప్పల్ జోన్ కార్యదర్శి ఎర్రం శ్రీనివాస్, *ప్రజాసంకల్పం బాపట్ల కృష్ణమోహన*, ఎస్ఎఫ్ఐ ఉప్పల్ మండల కార్యదర్శి మణికంఠ, ఎస్ఎఫ్ఐ నాయకులు M.శివ, బల్లెం గౌతం, సాయి కిరణ్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

------------------------------------------------------------
*Video -1*                 https://youtu.be/zCM76PmuBFs          *Video -2*    https://youtu.be/AUAe5EFSgi4      *తెలంగాణ డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారు మీరేమో మనబడి అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలి అని అధికారులకు ఆదేశాలు ఇస్తే వారేమో మీ ఆదేశాలను పాటిస్తలేరు దానితో కొందరు HM లు & ఉపాధ్యాయులు అవినీతికి అలవాటు పడి విద్యావ్యవస్థను బ్రష్టుపట్టిస్తున్నారు. ఈ అంశం మీద మేడ్చల్ జిల్లా SFI నాయకులు రాథోడ్ సంతోష్ (జిల్లా కార్యదర్శి)ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేసి మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ గారికి & DEO మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.... Bplkm🪶*  NOTE : *పూర్తి వివరాలు* prajasankalpam1.blogspot.com లో   *Copy to Group link Media*  20/06/2022

Sunday, June 19, 2022

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కీలక నిర్ణయం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కీలక నిర్ణయం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. తమ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో విద్యార్థులు తుది సమరానికి సిద్దమయ్యారు. దీంతో 24 గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. రాత్రంతా బయటే ఉండి నిరసనను తెలియజేయాలని నిర్ణయించారు. ఓవైపు వర్షం వర్షం కురుస్తున్నా.. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థులు ప్రతిపాదించిన 12 డిమాండ్లను పరిష్కరించాలని, ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రంతా బయటే ఉండి తమ నిరసనను తెలియజేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత ఐదు రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైకరిపై ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు రాత్రంతా నిరసన దీక్ష చేయాలని నిర్ణయించామని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది.

2017 లోనూ తాము నిరసన చేసినా అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేదని స్టూడెంట్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపస్ కు ఒకసారి వచ్చి తమ సమస్యలను పరిశీలించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే ముఖ్యంగా తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించని కేసీఆర్ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థులు నేరుగా సీఏం కేసీఆర్‌ గానీ మంత్రి కేటీఆర్‌ గానీ వచ్చి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే విద్యార్థుల కీలక నిర్ణయం తీసుకున్నారు. 24 గంటల నిరసన దీక్షకు పిలుపు నిచ్చారు. రాత్రంతా బయటే ఉండి నిరసనను తెలియజేయాలని నిర్ణయించారు.

తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా..... జస్టిస్ ఉజ్జల్ భూయాన్.....!

*తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా..... జస్టిస్ ఉజ్జల్ భూయాన్.....!*

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను బదిలీ చేసి ఆయన స్థానంలో జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌కు పదోన్నతి ఇవ్వాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఆమేరకు ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మను దిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

link Media ప్రజల పక్షం 🖋️ 

పట్టువీడని విద్యార్ధులు.... బాసరలో 6 వ రోజు కొనసాగుతున్న నిరసన....!

*పట్టువీడని విద్యార్ధులు.... బాసరలో 6 వ రోజు కొనసాగుతున్న నిరసన....!*

బాసర: బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అటు విద్యార్థులు పట్టువీడటం లేదు... విద్యార్థులు ప్రతిపాదించిన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన పూర్తి స్థాయిలో రావడం లేదు.ఫలితంగా ఆరో రోజు కూడా బాసరలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది.

ఐఐటీ ప్రధాన ద్వారం వద్ద దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మెయిన్‌ గేటు వద్దకు ఎవర్నీ వెళ్లనీయకుండా పోలీసులు రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. గత ఆరు రోజులుగా బాసరలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 12 డిమాండ్లతో ఈనెల 14 నుంచి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. బాసర ట్రిపుల్‌ ఐటీకీ 2 కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మద్దతుగా ఇవాళ సాయత్రం నిజామాబాద్‌ నుంచి ఏబీవీపీ కార్యకర్తలు బాసర చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసుల ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని బాసర పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. మరో వైపు యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం స్వచ్ఛందంగా ఇంటికి వెళ్లే విద్యార్థులకు అనధికారికంగా అనుమతిస్తోంది. ఆరు సంవత్సరాల ట్రిపుల్‌ ఐటీ కోర్సులో పీయూసీ-1, పీయూసీ-2 చదువుతున్న విద్యార్థులను కుటుంబ సభ్యలకు సమాచారం ఇవ్వకుండా, వారు వెంటలేకుండా వెళ్లేందుకు అనుమతించకూడదనే నిబంధన ఉంది. కానీ, ఆరు రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో నిబంధనలను యాజమాన్యం అనధికారికంగా సడలించింది.

link Media ప్రజల పక్షం🖋️ 

తెలంగాణ లో విద్యావ్యవస్థను నాశనం చేస్తున్న ప్రభుత్వం & ప్రతిపక్షాలు

*తెలంగాణా లో విద్యావ్యవస్థ నిర్లక్ష్యం అవుతుంటే ప్రతిపక్షాలు & అన్ని విద్యార్థి సంఘాలు & మేధావులు అనబడే మూర్కులు & మెయిన్ స్ట్రీమ్ మీడియా తమ బాధ్యతను నిర్వర్టిస్తలేవు..... ప్రయివేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు అనుకూలంగా వున్నారు వీరు అందరు.... ఎన్ని చట్టాలు / GO / కమిటీ లు వున్నా ప్రభుత్వాలు పట్టించుకుంటాలేవు...ఇది నిజం..... Bplkm🪶*  *Copy to Group link Media*
NOTE : *తల్లితండ్రులు ప్రశ్నించేతత్వాన్ని అలవాటు చేసుకుంటాలేరు.విద్యాసంస్థల యాజమాన్యాలు బయపెడుతున్నాయి మీ పిల్లల భవిష్యత్ మా చేతిలో వుంది అని*  prajasankalpam1.blogspot.com